Saturday, 12 May 2012
Thursday, 10 May 2012
Monday, 26 March 2012
Wednesday, 21 March 2012
MY NEW IMAGES AND BHADRADRI KALABHARATHI POSTERS
Tuesday, 20 March 2012
ప్రముఖ సిని గీతరచయత శ్రీ అనంత శ్రీరాం గారితో నేను
మా నాన్న స్వర్గీయ శ్రీ రామచంద్రయ్య జల్లారపు గారు
Saturday, 4 February 2012
ఆషాసింగ్ మన దేశపు మెుట్టమెుదటి మహిళా మిమిక్రీ కళాకారిణి
మిమిక్రీ ఆషాజీ
ఒక వ్యక్తి ఒక కళలో నైపుణ్యం సాధిస్తే
గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరే పలు కళల్లో ప్రజ్ఞ కనబరిస్తే వారిని
బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడతాం. అలా పలు కళల్లో ప్రజ్ఞ కనబరుస్తూ పేరు
ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి, యాంకర్, లైవ్ పెర్ఫార్మర్, ఆర్టిస్ట్
కోఆర్డినేటర్, షో అరేంజర్, రైటర్ ఆషాసింగ్ మన దేశపు మెుట్టమెుదటి మహిళా
మిమిక్రీ కళాకారిణిగా గణతిెకక్కారు. ఆషా నాగపూర్ వాసి.
దాదాపు
20ఏళ్ళ కిందట మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్ షోలు ఇస్తూ నలుగురి దృష్టినీ
ఆకర్షించారామె. అప్పటి వరకు మగవారు మాత్రమే మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు.
ఆ సంప్రదాయాన్ని తోసిరాజని ఆషా పలు స్టేజ్ షోలలో ఒకనాటి ప్రముఖ నటీమణులు
మీనాకుమారి, ఆషాపరేఖ్, షర్మిలాటాగూర్, శ్రీదేవి, మాధురీదీక్షిత్,
కరిష్మాకపూర్ వంటి తారల గొంతును అచ్చుగుద్దినట్టు పలికించి ప్రేక్షకుల
కరతాళ ధ్వనులు అందుకునేవారు.అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె తన నివాసాన్ని ముంబైకి మార్చారు. అక్కడికి వెళ్లాక ఆమె మిమిక్రీ షోలతో బాగా బిజీ అయ్యారు. దాంతో పాటే కొన్ని టీవీ సీరియల్స్లోనూ నటించే అవకాశాలు సంపాదించారు. అలా ఒక పక్క మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ టీవీల్లో నటిస్తూనే ఆషా మ్యూజికల్ గ్రూప్ను స్థాపించి, భిలాయ్లో ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంట్, సహారా లేక్ సిటీ, అంబీవాలీ, హోటల్ సీ ప్రిన్సెస్, రామీ గెస్టలైన్, నిషీల్యాండ్ పార్క్ వంటి చోట్ల ఆర్కెస్ట్రాలు ఇచ్చేవారు.
ప్రతి న్యూ ఇయర్ వేడుకలలో నాగపూర్లోని ప్రముఖ హోటళ్ళలో ఆమె మిమిక్రీ ప్రోగ్రామ్ గానీ, ఆర్కెస్ట్రా గానీ ఉండాల్సిందే. అంతలా ఆమె నాగపూర్ వాసుల హృదయాలను దోచుకున్నారు.1986లో నాగపూర్కు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్సవాలకు హాజరైన బిగ్బి అమితాబ్ ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆషా సింగ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి ఆమె ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు.
ఇదిలా ఉండగా 1997లో ఆషాసింగ్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో అతిపెద్ద స్టార్ షోను ఏర్పాటు చేసారు. ఆ షోలో అప్పటి ప్రముఖ బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తి, అస్రానీ, గుల్షన్గ్రోవర్, ఖాదర్ఖాన్ వంటివారు పార్టిసిపేట్ చేసారు. అక్కడ ఆషా ప్రదర్శించిన మిమిక్రీ ఐటెమ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అక్కడి నుంచి ఆషా పేరు బాలీవుడ్లో కూడా తరచూ వినిపించడం ప్రారంభించింది. దాంతో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. అలా ఆమె బాజీగర్, ఆగ్, న్యాయ్ అన్యాయ్, ఏ ఆగ్ కబ్ భుజేగీ, దో మత్వాలే, స్వర్గ్ జైసా ఘర్, పోలీస్ ఆఫీసర్, దీదర్, దివ్యశక్తి, ఖుదాకానూన్, మహబూబ్ మేరే మహ్బూబ్, గీత్ మిలన్కె గాతే రహేంగే, కహానీ కిస్మత్కీ వంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు భోజ్పురి, రాజస్థానీ, గుజరాతీ, చత్తీస్ ఘడ్, పంజాబీ వంటి విభిన్న భాషా చిత్రాల్లో కూడా నటించారు.
ఇక టీవీ సీరియల్స్ విషయానికి వస్తే మహాభారత్, కిస్సేమియా బీవీకే, మజ్దార్, ఆఖిరీ దావ్, ఉల్జీరహే, చల్తీరహే, జిందగీ, పూల్ కిలే గుల్షన్ గుల్షన్, ఇంద్రధనుష్, మిట్టీకే రంగ్, చంద్రకాంత్, విరాట్, అపరాజిత, అర్థాంగిని, ఔరత్, కామ్యాబీ, జానూన్, సాహిల్, షేక్, రిపోర్టర్, కమాండర్, పరంపర, అపరాధ్, దరార్, యూలే లవ్ స్టోరీస్, అక్బర్ బీర్బల్, షాహీన్, నజ్జీకియాన్, కామినీ దామినీ వంటి వాటిలో నటించారు. నాగపూర్లోని సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆషాసింగ్కి చిన్నతనం నుంచీ కళలంటే ఎంతో మక్కువ. సినిమాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా ఆమె మీనాకుమారిని ఆరాధించేవారు. దాంతో తనకు తెలియకుండానే ఆమెపై మీనాకుమారి ప్రభావం పడింది.
ఆమెలానే మాట్లాడేందుకు, కనిపించేందుకు ప్రయత్నించేవారు. ఆమె ధోరణికి ఇంట్లోవారు తొలుత అభ్యంతరం తెలిపినా తర్వాత తర్వాత అలవాటు చేసుకున్నారు. పెళ్ళయ్యాక కూడా ఆమె ధోరణిలో మార్పు రాలేదు. అయితే ఆమె భర్త ఆమెను ఏనాడూ ఆమెపై ఎటువంటి ఆంక్షలు పెట్టేవారు కాదు. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో మెల్లగా తెలిసిన వారి ముందు చేసే మిమిక్రీని బయట స్టేజ్పై చేయడం మొదలుపెట్టారు.
Tuesday, 24 January 2012
Tuesday, 10 January 2012
Friday, 30 December 2011
Tuesday, 27 December 2011
Wednesday, 21 December 2011
నవ్వుల రాజులు ఈ ఇంజినీర్లు
ఐఐటి ఇంజినీర్లు నవ్వుల
రాజులయ్యారు
ఐఐటీ చదివింది నవ్వులపాలవ్వడానికా..? నవ్వుల రాజులవ్వడానికా...? అదరగొట్టే ప్యాకేజ్లతో అందివచ్చిన ఉద్యోగాలను వద్దుపొమ్మన్న ఈ నలుగురు ఐఐటీ ఇంజనీర్లు గిలిగింతలు పెట్టే విజయాన్ని ఎలా సాధించారో చూస్తే, ఉద్యోగమో రామచంద్రా అంటూ చెప్పులరిగేలా తిరిగే యువతీయువకులకు బోలెడు స్ఫూర్తి వస్తుంది...
"అంత కష్టపడి ఐ.ఐ.టి. చదివి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలొస్తే వద్దుపొమ్మంటారా..? మీరేంటి గురూ జీవితాన్ని ఇంత కామెడీగా తీసుకుంటున్నారు..?''
క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలొచ్చిన తోటి విద్యార్థులందరూ ఆ నలుగురు తీసుకున్న నిర్ణయానికి విస్తుపోయారు. వాళ్లు చుట్టూ చేరి నచ్చజెబుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు తప్పిస్తే, కిం చిత్తు రాజీపడటం లేదు ఆ నలుగురు."...ఇక, మేము ఎంత చెప్పినా వినేట్టు లేరు కానీ, ఆఖర్న ఒక మాట చెబుతున్నాం. మీరు కనుక ఈ ఉద్యోగాలను కాదనుకుంటే... భవిష్యత్తులో నవ్వులపాలవ్వడం ఖాయం..'' అంటూ లేచివెళ్లిపోతున్న స్నేహితులను చూస్తూ.. ఆ నలుగురు మళ్లీ పగలబడి నవ్వారు.
"అవును, మేము నవ్వులపాలవ్వాలని డిసైడయ్యాం. మేమే కాదు త్వరలో మిమ్మల్ని కూడా నవ్వులపాలు చేస్తాం. బీ కేర్ఫుల్..'' అన్నారు మూకుమ్మడిగా.
"వీళ్లకు పిచ్చి ముదిరిపోయింది'' గొణుక్కుంటూ వెళ్లిపోయారు క్యాంపస్ మిత్రులు.
***
"శభాష్రా, ఆ రోజు ఉద్యోగాలు వద్దనుకున్న మిమ్మల్ని చూసి పిచ్చోళ్లు అనుకున్నాం. ఈ రోజు మీ హాస్యాన్ని చూసి మేం పిచ్చెక్కిపోయాం'' అన్నారు ఐఐటి చదువుకున్న రోజుల్లో కలిసి తిరిగిన స్నేహితులు. ఎంతో కష్టపడితే కానీ, ఈ స్థాయికి ఎదగలేదంటున్న ఆ నలుగురే 'ఎంటర్టైన్మెంట్ ఇంజనీర్స్' వ్యవస్థాపకులు. పట్టా చేతికొస్తూనే 'ప్యా కేజ్'లతో కొట్టుకుపోతున్న నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న వాళ్లు.. హ్యూమర్ను కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు.
నలుగురిదీ నవ్వుల మార్గమే...
బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితిన్గుప్తా, ప్రశాంత్, విపుల్ గోయెల్, తుషార్ ఉపాధ్యాయ చిన్నతనం నుంచే హాస్యం రుచిమరిగారు. హాస్యకవితలు రాయడం, సెటైర్లు కొట్టడం, నాటికల్లో నటించడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో రాటుదేలారు. అభిరుచితో వచ్చిన ఆ నైపుణ్యాలతోనే కెరీర్ను మలుచుకోవచ్చనుకున్నారు. ఐఐటీ పూర్తి చేశాక హ్యూమర్నే పెట్టుబడిగా పెట్టి ఓ కంపెనీ పెట్టారు. అలా పుట్టిందే 'ఎంటర్టైన్మెంట్ ఇంజనీర్స్'.
"హ్యూమర్ అనేది మనుషులకు మాత్రమే అపురూప వరం. మా కంపెనీ 'ఎంటర్టైన్మెంట్ ఇంజనీర్స్'కు అదే పెట్టుబడి. నవ్వించగలిగే సామర్థ్యమే మాకున్న నైపుణ్యం. అందరూ నడిచేదోవలోనే ఎందుకు నడవాలి..? కొత్త మార్గంలో నడిస్తే వచ్చే నష్టమేమీ లేదు కదా..! అందుకే, మంచి ఉద్యోగాలొచ్చినా వద్దనుకున్నాం. ఈ-జనరేషన్ అనేక ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య బతకాల్సి వస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్లకు ఇప్పుడెంత డిమాండ్ ఉందో... రేపు హ్యూమర్కు కూడా అంతే డిమాండ్ ఉండబోతోంది.
అవి సక్సెస్ అవాలంటే హ్యూమర్ పండటం చాలా ముఖ్యం. మెట్రోనగరాల్లో కొత్తగా విస్తరిస్తున్న అమ్యూజ్మెంట్ పార్కుల్లో సైతం కామెడీ షోలకు గిరాకీ పెరుగుతోంది. యూనివర్శిటీలు, స్కూల్స్లో కూడా కామెడీ షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీరంతా నవ్వగలిగినంత కాలం మా కంపెనీకి ఢోకా లేదు..'' అంటాడు దీని వ్యవస్థాపకులు, చీఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్ (సీఈవో) అయిన నితిన్గుప్తా.
బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన 'లవ్ డిసెంబర్' హాస్యనాటికతో పాపులర్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ ఇంజనీర్స్లో 'హ్యూమర్ రిసోర్సెస్' (హెచ్.ఆర్)గా విపుల్ గోయెల్ చేరాడు. ఈయన కూడా ఐఐటీ బాంబేలోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. కామెడీ షోల నిర్వహణ బాధ్యత అతనిదే. హాస్యనటుడు తుషార్ ఉపాధ్యాయ నవ్వుల కంపెనీ మొత్తానికి వెన్నెముకలాంటి వాడు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన గతంలో- అంతర్ కళాశాలల వేడుకల్లో ఉత్తమ హాస్య నటుడుగా బోలెడన్ని బహుమతులు కొట్టేశాడు. కామెడీషోలలో గంటల తరబడి నిల్చుని నవ్వులు కురిపించే ఉపాధ్యాయ అలసటన్నదే ఎరుగడు. "నేను విసిరే హాస్యోక్తులు, పలికించే హావభావాలకు జనా లు విరగబడి నవ్వుతుంటే... నాకు కడుపు నిండిపోతుంది'' అంటాడాయన.
లాఫింగ్ రీసెర్చ్...
బాలీవుడ్ ప్రముఖులు సుభాష్ఘయ్, శేఖర్కపూర్లు వీళ్ల కామెడీషోలను చూసి.. "ఈ కామెడీ షోలను చూస్తుంటే భారత్లో హాస్యానికి మళ్లీ మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. బాలీవుడ్ హాస్య చిత్రాలను తలదన్నేరీతిలో ఇదొక పరిశ్రమగా ఎదగాలని ఆశిస్తున్నాం. హాస్యాన్ని కార్పొరేట్స్థాయి తీసుకెళ్లిన ఎంటర్ టైన్మెంట్ ఇంజనీర్స్ ఆ పని తప్పక చేస్తుంది'' అంటూ ప్రశంసించారు.
Thursday, 15 December 2011
Subscribe to:
Posts (Atom)






















